సందర్శనార్థం పార్టీ కార్యాలయంలో సురవరం భౌతికకాయం

సందర్శనార్థం పార్టీ కార్యాలయంలో సురవరం భౌతికకాయం

HYD: సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని హిమాయత్ నగర్ CPI పార్టీ కార్యాలయంలో ఉంచనున్నారు. ఉ. 10 నుంచి మ. 3 గంటల వరకు పార్టీ కార్యాలయంలో ఉంచి, అనంతరం గాంధీ ఆసుపత్రికి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. కాగా, ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.