ఘోరం.. భార్యను హతమార్చిన భర్త
NDL: ఆళ్లగడ్డలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య పుష్ప (35)ను భర్త చెన్నయ్య కత్తితో గొంతు కోసి హత్య చేశారు. ఇవాళ తెల్లవారుజామున ఇంట్లోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఆయన, అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.