నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుంది: కలెక్టర్

నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుంది: కలెక్టర్

జనగామ జిల్లాలో రెండవ విడతలో ఈ నెల 14న జరగనున్న గ్రామ పంచాయతీ పోలింగ్ నేపథ్యంలో నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 12న సాయంత్రం 5 గంటల నుంచి 14వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు ప్రచార కార్యకలాపాలన్నీ నిషేధం అన్నారు. బహిరంగ సభలు, ఊరేగింపులు, సోషల్ మీడియా ప్రచారాలు నిషేధమన్నారు.