ఎమ్మిగనూరులో పట్టాల పంపిణీ కార్యక్రమం
KRNL: ఎమ్మిగనూరులో MLA జయనాగేశ్వర రెడ్డి 64 కుటుంబాలకు నిన్న పట్టాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రహరీ పక్కన నివసిస్తున్న కుటుంబాలు కోర్టు ఆదేశాల మేరకు స్థలాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు నిరాశ్రయులుగా మారే పరిస్థితి నెలకొనగా MLA ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతీ కుటుంబానికి 3 సెంట్ల చొప్పున పట్టాలు మంజూరు చేయించారు.