రేపు తహసీల్దార్ కార్యాలయంలో PGRS కార్యక్రమం
NDL: సంజామల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ అనిల్ కుమార్ తెలిపారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపుతామన్నారు. పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయి అధికారులకు పంపిస్తామన్నారు. ప్రజలు సమస్యలు తెలపడానికి 1902 కాల్ సెంటర్, సచివాలయంలో కూడా అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు.