కోల్కతా చేరుకున్న మెస్సీ
ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ కోల్కతా చేరుకున్నాడు. మెస్సీతోపాటు ఫుట్బాల్ క్రీడాకారులు రోడ్రిగో, లూయిస్ కూడా కోల్కతాకు వచ్చారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(గోట్) ఇండియా టూర్లో భాగంగా పర్యటించనున్నారు. ఈ క్రమంలో కోల్కతా విమానాశ్రయానికి ఫుట్బాల్ అభిమానులు భారీగా చేరుకుని క్రీడాకారులకు ఘనస్వాగతం పలికారు.