ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారి దర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. కార్తీక మాసం కావడంతో అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో లైన్లో నిలిచున్న భక్తుల కోసం దుర్గగుడి దేవస్థానం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు.