రాజోలు వైసీపీ ఇంఛార్జ్‌కు అస్వస్థత

రాజోలు వైసీపీ ఇంఛార్జ్‌కు అస్వస్థత

కోనసీమ: రాజోలు వైసీపీ ఇంఛార్జ్, మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో అమలాపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్య బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకునేలా వైద్య సేవలు అందించాలని సూచించారు.