28న గడివేములలో రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్
NDL: గడివేముల మండలం శ్రీ పేట లక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం పురస్కరించుకుని ఈ నెల 28న రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన జట్లకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజేతలకు రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు అందజేయనున్నారు.