గ్రహణం వేళ.. నేడు పోలవరంలో ఆలయాల మూసివేత

గ్రహణం వేళ.. నేడు పోలవరంలో ఆలయాల మూసివేత

ELR: సంపూర్ణ చంద్రగ్రహణం దృష్ట్యా పోలవరం మండలంలోని ప్రధాన ఆలయాలు మంగళవారం ఉదయం 10 గంటలకు మూతపడనున్నాయి. భక్తాంజనేయస్వామి, నగరేశ్వర-వాసవీ కన్యకాపరమేశ్వరీ, పట్టిసీమ సుదర్శన వేంకటేశ్వరస్వామి, వీరేశ్వరస్వామి ఆలయాల్లో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అర్చకులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు సంప్రోక్షణ అనంతరం ఆలయాలను పునఃప్రారంభిస్తామని అన్నారు.