రోడ్డు ప్రమాదం.. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

ATP:పెద్దవడుగురు మండలం మిడుతూరు గ్రామ సమీపంలోని 44 హైవేపై మంగళవారం బైకును ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో గుత్తికి చెందిన నూర్ మొహమ్మద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.