గ్రామస్తుల విజ్ఞప్తికి స్పందించిన మాజీ ఎమ్మెల్యే
నిర్మల్: నర్సాపూర్ మండలంలోని తురాటి గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డిని కలిసి గ్రామంలో శివాలయం నిర్మాణం త్వరగా చేపట్టాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అలాగే దత్తురామ్కు రూ.25 వేల సీఎం సహాయ నిధి చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.