యాదాద్రి శ్రీవారికి నిజాభిషేకం

యాదాద్రి శ్రీవారికి నిజాభిషేకం

BNR: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి శనివారం ఉదయం నిత్య నిజాభిషేకం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరం బిందతీర్థంతో గర్భాలయ ప్రదక్షిణ నిర్వహించి పాలు, పెరుగు, పంచదార పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో నిజాభిషేకం వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం బాల భోగం నివేదించారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.