'ఆయుష్ ఆసుపత్రికి నిధులు మంజూరు’
SKLM: ఏపీ రాష్ట్ర ఆయుష్ డిపార్ట్మెంట్ బూర్జ గ్రామంలో ఆయుష్ హాస్పిటల్ (ఆయుర్వేదం) కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.30 లక్షల నిధులను మంజూరు చేసినట్లు ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ శనివారం పేర్కొన్నారు. ఈ నిధులు మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబు, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్కి కృతజ్ఞతలు తెలిపారు.