108 గర్భిణీ ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

108 గర్భిణీ ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

ప్రకాశం: మర్రిపూడి మండలం చీమట గ్రామానికి చెందిన గర్భిణీకి పురిటి నొప్పులు అధికమవడంతో కుటుంబీకులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిగా చేరుకున్న సిబ్బంది ఒంగోలు వైద్యశాలకు తరలిస్తుండగా చీమకుర్తి సమీపంలో నొప్పులు అధికమై పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది శివ, సుభాని తెలిపారు. కుటుంబీకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.