జనగణన.. వివరాలు నమోదు చేసుకున్న సీఎం
AP: రాష్ట్రంలో జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొని పౌరులందరికీ స్ఫూర్తిగా నిలిచారు. స్వీయ జనగణనలో భాగంగా ఆన్లైన్లో జనగణన వివరాలు నమోదు చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమాచారాన్ని అధికారులకు అందించి నమోదు చేయించుకున్నారు. కాగా, ఆన్లైన్లో స్వీయ నమోదుకు నెలాఖరు వరకు అవకాశం ఉంది.