పురుగు మందు తాగిన వ్యక్తి మృతి

VZM: గజపతినగరం మండలం ఎం. వెంకటాపురం గ్రామానికి చెందిన వి.హరీశ్ (30) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అరకులో ఉద్యోగం చేసేందుకు వెళ్లిన హరీశ్ గంట్యాడ మండలం కె. తామరపల్లి సబ్ స్టేషన్ వద్ద సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు మహారాజా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు.