14 మందికి కంటి ఆపరేషన్లు

14 మందికి కంటి ఆపరేషన్లు

అన్నమయ్య: రాయచోటిలోని చెన్నముక్కపల్లి లయన్స్ కంటి ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత శిబిరంలో 30 మందికి పరీక్షలు నిర్వహించగా, అర్హులైన 14 మందికి కంటి ఆపరేషన్లు చేశారు. గతంలో ఆపరేషన్ చేయించుకున్న 25 మందికి పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు, మందులు పంపిణీ చేశారు. రోగులు, సహాయకులకు ఎన్నారై దాత ఎర్రగొండ గోవర్ధన్ రెడ్డి సహకారంతో అన్నదానం నిర్వహించారు.