అక్రిడేషన్ల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్కు వినతి
NGKL: జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టర్ బధావత్ సంతోష్కు వినతిపత్రం సమర్పించారు. అమరాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మన్ననూర్, దోమలపెంట జర్నలిస్టులకు మొదటి జాబితాలోనే అక్రిడేషన్లు ఇవ్వాలని కోరారు. సమాచార శాఖ సైట్లో ఈ కేంద్రాల వివరాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.