ఆలయంలో తొక్కిసలాట.. కారణం ఇదే!

ఆలయంలో తొక్కిసలాట.. కారణం ఇదే!

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకన్న ఆలయంలో తొక్కిసలాట జరిగి.. 9 మంది మృతిచెందారు. ఇవాళ కార్తీక ఏకాదశి కావడంతో స్వామివారి దర్శనానికి స్థానికులతోపాటు పక్క జిల్లాల నుంచి భక్తులు పోటెత్తారు. అయితే, 3 వేల మందికి అవకాశం ఉన్న ప్రదేశంలో.. 20 వేల మంది రావడంతో రేలింగ్ కూలి ఒక్కసారిగా తొక్కిసలాట జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.