మృతి చెందిన బాలిక.. పదో తరగతి పరీక్షల్లో స్కూల్ ఫస్ట్

SRCL: జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నాగచైతన్య అనే బాలిక, ఏప్రిల్ 17న అనారోగ్యంతో మృతి చెందింది. మల్లాపూర్ ప్రభుత్వ హై స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసింది. బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్గా నిలిచింది. ఈ విషయం తెలుసుకుని బాలిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమాయ్యారు.