ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు
NLR: ఆత్మకూరు మండలం బట్టేపాడు సొసైటీ భవనంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం అధికారులు ప్రారంభించారు. సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం గిట్టుబాటు ధర కల్పిస్తూ వెంటనే నగదు చెల్లింపు కూడా చేస్తామని రైతులకు అధికారులు వివరించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుంది అని అధికారులు పేర్కొన్నారు.