సేవాభావాన్ని చాటుకున్న మంత్రి మండిపల్లి
అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. వృద్ధులు, దివ్యాంగులతో కూర్చొని వారి సమస్యలను శ్రద్ధగా విని ధైర్యం చెప్పారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. దీంతో స్థానికులు మంత్రి శైలిని ప్రశంసించారు.