'సూర్యఘర్ సోలార్ పనులు వేగవంతం చేయాలి'

'సూర్యఘర్ సోలార్ పనులు వేగవంతం చేయాలి'

KDP: మైదుకూరు విద్యుత్ కార్యాలయంలో ఎస్ఈ శ్రీనివాసులు అధ్యక్షతన గురువారం సమీక్షా సమావేశం జరిగింది. పీఎం సూర్యఘర్ కింద ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై చేపట్టిన సోలార్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వేసవిలో కరెంట్ కోతలు లేకుండా చూడాలని, పగటిపూట వీధిలైట్లు వెలగకుండా నివారించాలని, గ్రామాల్లో విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.