పాఠశాల విద్యార్థులకు పెన్నుల పంపిణీ
GDWL: శాంతినగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు కోసం ఐనవోలు ఆలయ ఈవో సత్యనారాయణ రాజు పంపిన పెన్నులు పట్టణానికి చెందిన గాయత్రి శ్రీనివాసులు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయులు మద్దిలేటి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.