వడదెబ్బతో మరణిస్తే రూ. 4 లక్షల పరిహారం

వడదెబ్బతో మరణిస్తే  రూ. 4 లక్షల పరిహారం

BDK: వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. హీట్ వేవ్, సన్ స్ట్రోక్‌లను వడదెబ్బను స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్‌గా పేర్కొంది. ఎవరైనా వడదెబ్బతో చనిపోతే పోస్ట్ మార్టం చేయించాలి. మరణ ధ్రువీకరణ పత్రం, పోస్ట్ మార్టం రిపోర్టుతో దరఖాస్తు చేస్తే నష్టపరిహారం చెల్లిస్తారు.