వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ను సందర్శించిన జలమండలి ఎండీ
HYD: తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జలమండలి పరిధిలోని పలు వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ను సందర్శించారు. కొండాపూర్, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, బంజారాహిల్స్, సోమాజిగూడ ఫిల్లింగ్ స్టేషన్లలో బుకింగ్ అధికంగా ఉండటంతో అధికారులు 24 గంటలు మానిటర్ చేయాలని తెలిపారు.