దాడి ఘటనపై కేసు నమోదు

దాడి ఘటనపై కేసు నమోదు

JGL: బుగ్గారం మండలం చిన్నాపూర్లో దాడి ఘటనపై ఎస్సై సతీష్ కేసు నమోదు చేశారు. దమ్మ లక్ష్మి ఫిర్యాదు మేరకు గట్టు గంగారం బస్ స్టాండ్ వద్ద దమ్మ తిరుపతిని కులం పేరుతో దూషించినట్లు తెలిపారు. అనంతరం గట్టు గంగారం తన తమ్ముడు గట్టు గంగాధర్, కుమారుడు గట్టు గణేష్తో కలిసి గ్రామ శివారులోని ఓ షెడ్ వద్ద తిరుపతిపై దాడి చేసి గాయపరిచినట్లు పేర్కొన్నారు.