BREAKING: భారత్ చేరుకున్న భారీ చమురు నౌక
గుజరాత్లోని ముంద్రా పోర్టుకు భారీ చమురు నౌక ‘శివాలిక్’ చేరుకుంది. ఖతార్ నుంచి బయలుదేరిన ఈ నౌక.. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల మధ్య అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటుకుని సురక్షితంగా భారత్కు చేరుకుంది. ఇందులో దాదాపు 54 వేల టన్నుల LPG గ్యాస్ నిల్వలు ఉన్నాయి. దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా ఈ నౌక రాక ఎంతో ఊరటనిస్తోంది.