సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
SRD: తెలంగాణలో దక్షిణ కాశీగా పిలవబడుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో గురువారం స్వామివారికి అమావాస్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాల పవిత్ర గంగా జలంతో అభిషేకం చేసి మంగళ హారతి చేశారు. ఈ వేకువ జాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.