ఎమ్మిగనూరులో ట్రాక్టర్ దగ్ధం.!
KRNL: ఎమ్మిగనూరులోని శివ సర్కిల్ వద్ద ఇవాళ వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్కు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేసుకొని మంటలు ఆర్పారు. అయితే అప్పటికే పూర్తిగా కాలిపోయి నష్టం జరిగిందన్నారు. రోడ్లపై ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని కోరుతున్నారు.