ఆలస్యం కానున్న కౌంటింగ్.. ఎందుకంటే.?
WGL: పోలింగ్ సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు 84.2% పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంకా 10 నుంచి 12% ఓటర్లు క్యూలైన్లోనే ఉండడంతో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దీంతో కౌంటింగ్ మరింత ఆలస్యం కానుంది.