ప్రజా సంక్షేమం ప్రభుత్వంతో సాధ్యం: టీడీపీ ఇంఛార్జ్
KDP: రాజంపేట నియోజకవర్గంలో ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. ఈనెల 16న నిర్వహించనున్న మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. గ్రామ స్థాయిలో అవసరమైన వారికి సమాచారం అందించి శిబిరానికి హాజరు కావాలన్నారు.