పాఠశాలల తనిఖీ సభ్యుల నియామకానికి దరఖాస్తులు
MNCL: ప్రభుత్వ పాఠశాలల తనిఖీ కోసం ఏర్పాటు చేయనున్న టీమ్లలో సభ్యుల నియామకానికి దరఖాస్తుల గడువు పొడిగించినట్లు మంచిర్యాల DEO యాదయ్య ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 వరకు కలెక్టరేట్లోని ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.