హనుమాపురంలో వాహనాల తనిఖీ.. 17 మందికి జరిమానా!

హనుమాపురంలో వాహనాల తనిఖీ.. 17 మందికి జరిమానా!

KRNL: పెద్దకడబూరు మం. హనుమాపురం వద్ద ఆదివారం ఎస్సై నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 17 మంది వాహనదారులకు రూ. 3,995 జరిమానా విధించారు. హెల్మెట్ లేకపోవడం, లైసెన్స్ నిబంధనలు పాటించకపోవడంపై SI ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని ఆయన సూచించారు.