నీటి సరఫరా బోర్డు విలీనం వద్దని వినతి
సత్యసాయి: సత్యసాయి నీటి సరఫరా బోర్డును జిల్లా పరిషత్లో విలీనం చేయవద్దని అహుడా చైర్మన్ టీసీ వరుణ్కు కార్మిక సంఘం నాయకులు విన్నవించారు. అనంతపురంలో ఆయనను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్మికులకు అండగా ఉంటామని, మెరుగైన వ్యవస్థ కోసం కృషి చేస్తామని వరుణ్ హామీ ఇచ్చారు.