'మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష'

'మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష'

SRCL: మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష, జరిమానా తప్పదని పట్టణ సీఐ కృష్ణ అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 57 మంది మందు బాబులు పట్టుబడ్డారు. పోలీసులు శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టగా 57 మంది మందు బాబులకు జరిమానాలు విధిస్తు మేజిస్ట్రేట్ జయశ్రీ తీర్పు వెల్లడించినట్లు తెలిపారు.