'పులివెందులలో TDP జెండా ఎగురవేసి తీరుతాం'
కడప జిల్లాలోని పులవెందులలో వైఎస్ రాజారెడ్డి కాలనీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూగుట్ల మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరాయి. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథితో కలిసి బీటెక్ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ.. టీడీపీ జెండాను పులివెందులలో ఎగురవేసి తీరుతామని అన్నారు.