ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై బీసీవై హెచ్చరిక

GNTR: తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదని బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని విమర్శించారు. ఎన్టీఆర్ గొప్ప నటుడే కాని ఆయనను శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్ఠించడం హిందువుల, యాదవుల మనోభావాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేశారు.