రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేసిన ఎమ్మెల్యే

రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేసిన ఎమ్మెల్యే

కోనసీమ: రాజోలు మండలంలోని రాజోలు, ములికిపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సోమవారం పర్యటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన పాల్గొని గ్రామానికి చెందిన రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.