గ్రహణానంతరం రాజన్నని దర్శించుకున్న విప్
SRCL: చంద్రగ్రహణం ముగియడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. శుద్ధి చేసిన అనంతరం ఆలయాన్ని తెరవడంతో ఆలయ ఈవో రమాదేవితో కలిసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.