'ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి'
SRPT: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం తెలంగాణ స్టూడెంట్ పరిషత్(TSP) ధర్నా నిర్వహించింది. TSP అధ్యక్షుడు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు రాకపోవడంతో విద్యకు దూరమవుతున్నారన్నారు.