మంత్రి కార్యాలయాన్ని ముట్టడించిన..SFI నాయకులు
MLG: ములుగు జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ఇవాళ SFI నాయకులు ముట్టడించేందుకు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. SFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.