'నిబంధనల మేరకే ఇళ్లు నిర్మించుకోవాలి'
MBNR: మిడ్జిల్ మండలంలోని రాణిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇంళ్లు, నర్సరీలను గురువారం ఎంపీడీవో గీతాంజలి పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం ఇంళ్లను నిర్మించుకోవాలన్నారు. లేనియెడల బిల్లుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. అనంతరం నర్సరీని సందర్శించి మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించాలని నిర్వాహకులకు సూచించారు.