భద్రాచలం నది తీరంలో కార్తీక పౌర్ణమి శోభ

భద్రాచలం నది తీరంలో కార్తీక పౌర్ణమి శోభ

BDK: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నది తీరంలో సందడి వాతావరణం దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా దేవస్థానం, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను నదిలో వదిలి భక్తి పారవస్యంతో మునిగిపోయారు.