రేషన్ కోసం తొమ్మిది రోజులు పడిగాపులు

JGL: చౌకధరల దుకాణాలలో పంపిణీ చేసే రేషన్ బియ్యం కోసం పేదలు తొమ్మిది రోజులు పడిగాపులు కాశారు. ప్రతి నెల 1వ తారీకు నుంచే పంచాల్సిన బియ్యం బుగ్గారం మండలంలో మాత్రం 9వ తేదీ నుంచి పంపిణీ ప్రారంభం చేశారు. ఈ నెల 8న గంగాపూర్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభోత్సవం చేశారు. మరుసటి రోజు నుంచి అన్ని గ్రామాలలో పంపిణీ చేశారు.