పదేండ్లు అసమర్ధత పాలన కొనసాగింది: ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ పట్టణంలో ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెఆర్ఎంబి జలాల విషయంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో పదేండ్లు అసమర్థత పాలన కొనసాగించారని అన్నారు. తెలంగాణ ఉద్యమం చేసిందే నీళ్లు, నిధులు, నియామకాల కొరకని అన్నారు.