సపోటా పండ్లతో స్వామివారి అలంకరణ

సపోటా పండ్లతో స్వామివారి అలంకరణ

ATP: తాడిపత్రిలోని ప్రసిద్ధ బుగ్గరామలింగేశ్వరస్వామి క్షేత్రంలో మంగళవారం ఉదయం స్వామివారిని విశేషంగా సపోటా పండ్లతో అలంకరించారు. శివలింగం చుట్టూ పండ్లను అమర్చిన తీరు సందర్శకులను కట్టిపడేసింది. ప్రకృతి ప్రసాదాలతో దైవాన్ని కొలవడం భక్తికి, పర్యావరణ హితానికి నిదర్శనమని అర్చకులు యోగానందశర్మ పేర్కొన్నారు. ఫలాల అలంకరణను చూసి భక్తులు పులకించిపోయారు.