దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలించిన ఎమ్మెల్యే
NZB: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పరిశీలించారు. ఇవాళ డిచ్పల్లి మండలం సుద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆందోళనచెందాల్సిన అవసరం లేదని కష్టకాలంలో అండగా ఉంటామన్నారు.