ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
CTR: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. వెదురుకుప్ప మండలం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ థామస్తో కలిసి ఆయన హాజరయ్యారు. పలువురు ప్రజలు తమ సమస్యలపై ఆయనకు వినతి పత్రాలు అందించారు. అధికారులు వీటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.